ATP: హంద్రీనీవా సాగునీటి జలాల సాధనే తమ ప్రధాన లక్ష్యం అని రైతు సంఘం నాయకులు గోవింద్ పేర్కొన్నారు. గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో చెరువులకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలు మళ్లించడానికి నిధులు కేటాయించాలని గత రెండు రోజులుగా చేస్తున్న సామూహిక దీక్షలు ఆదివారం మూడో రోజుకు చేరాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.