ASR: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం నక్కపల్లి మండలం చందనాడ వద్ద ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3.05 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా నక్కపల్లి మండలం చందనాడ వెళ్తారు.