GNTR: తెనాలిలో మ్యాట్రిమోనీ పేరుతో మహిళను మోసం చేసిన కొత్తూరులంకకు చెందిన అరవపల్లి వంశీని త్రీటౌన్ సీఐ సాంబశివరావు ఆదివారం అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో రూ.12 లక్షలు వసూలు చేసి వివాహం చేయకుండా మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.