BDK: కరకగూడెం మండలంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారిని డీఎస్పీ రవీందర్ రెడ్డి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మండలంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ పై యుద్ధం, శాంతి భద్రతల వంటి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి నరేందర్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.