GNTR: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముఖ్యమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్జీ పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు తెలియజేశారు.