కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం తణుకుకి చెందిన ఆకుల సాయి ఈశ్వర్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్నకు విరాళంగా రూ. 25,001లు ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించి, స్వామి వారి చిత్రపటం అందజేసారు.