BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.26,27,261 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.11,12,890, కార్ పార్కింగ్లో రూ.3,35,500, VIP దర్శనాలతో రూ.3,30,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,70,600, వ్రతాలతో రూ.92,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి ఆదాయం వచ్చిందన్నారు.