ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని ఏటీఎం కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. బ్యాంక్ అధికారులకు ఏటీఎంల నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, భద్రతపై సూచనలు ఇచ్చామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ప్రతిరోజూ రాత్రి ఏటీఎం కేంద్రాలను పోలీసు సిబ్బందితో తనిఖీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.