MBNR: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే దేశ ప్రగతికి మూలమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు తన సొంత నిధులతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించాలని, వారి ఉన్నతికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.