TG: సీఎం విదేశీవిద్యా పథకానికి మైనారిటీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. 2026 జనవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈపాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని తెలిపారు. అవసరమైన పత్రాలతో దరఖాస్తులను ఫిబ్రవరి 20లోగా సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులను అందించాలని సూచించారు.