AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతిచెందడం బాధాకరమని అన్నారు. గాయపడినవారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.