AP: రాష్ట్రంలోని రాజ్భవన్కు లోక్భవన్గా పేరు మార్చారు. పేరు మార్చడానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల అధికారిక నివాసం రాజ్భవన్ పేరును లోక్భవన్గా మార్చాలని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోనూ పేరు మార్చారు.