మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కొత్తగా తయారయ్యే మొబైల్స్లో తమ సైబర్ సెక్యూరిటీ యాప్ను (Sanchar Saathi) డిఫాల్ట్గా అందించాలని సూచించినట్లు తెలుస్తోంది. దేశంలో సైబర్ నేరాలు, చోరీలను అరికట్టడానికి, IMEI స్పూఫింగ్ను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ యాప్ అమలుకు మొబైల్ కంపెనీలకు 90 రోజులు గడువు ఇచ్చింది.