ATP: గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామానికి చెందిన రైతు చంద్ర శనివారం పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న చంద్రాను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.