MHBD: కొత్తగూడ మండలంలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ను ఇవాళ తుడుం దెబ్బ నాయకులు సందర్శించి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 240 మంది విద్యార్థులు చదువుతున్న ఈ స్కూల్లో రన్నింగ్ ట్రాక్ గుంతలతో నిండి, బురదగా మారింది. టాయిలెట్స్, నీళ్ల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ITDA PO, కలెక్టర్ స్పందించి స్కూల్ను అభివృద్ధి చేయాలని కోరారు.