SRPT: కోదాడ ఆగ్రో సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం రాత్రి కోదాడ పట్టణంలో జరిగింది. ఈ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసుల నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా షేక్ పాషా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్గా చింతకుంట రామకృష్ణారెడ్డిని ఎన్నుకున్నారు.