ADB: గంజాయి వ్యసనానికి బానిసైన ఓ యువకుడిని కోర్టు ద్వారా డీ- అడిక్షన్ సెంటర్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలో కోర్టు ద్వారా ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి అన్నారు. తల్లిదండ్రుల అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, యువకుడు కోలుకునే వరకు అక్కడ చికిత్స అందుతుందని పేర్కొన్నారు.