KMM: నిత్య జీవితంలో క్రీడల ప్రాముఖ్యత, మానసిక ఉల్లాసం గురించి మంత్రి తుమ్మల తనయుడు, కాంగ్రెస్ నేత తుమ్మల యుగంధర్ వివరించారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యుగంధర్ క్రీడాకారులతో కలిసి ఆడారు. ఈ టోర్నీతో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.