TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాత్రి BJP నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని.. పోలీసుల బలప్రయోగంతో, నిరంకుశ చర్యలతో ఆ హక్కును కాలరాయాలని చూడటం పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు.