NZB: కష్టాల్లో ఉన్న గిరిజన కుటుంబానికి తామున్నామంటూ ‘ఆల్ ఇండియా గిరిజన సేవా సంఘం’ మానవత్వాన్ని చాటుకుంది. మండల కేంద్రంలో డయాలసిస్ వ్యాధితో పోరాడుతూ ఇటీవల మరణించిన కుప్పకంటి గ్రామానికి చెందిన మూడవత్ హంస కుటుంబాన్ని సంఘం సభ్యులు ఆదివారం సాయంత్రం పరామర్శించారు. సంఘం నేతలు, వారికి తక్షణ సాయం అందించి భరోసా కల్పించారు.