అన్నమయ్య జిల్లా రాయచోటి బస్టాండ్ వద్ద ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఈ అనాథ శవానికి మంగళవారం ఉదయం రాయచోటి టౌన్ పోలీస్ ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్స్ మురళీ, నారాయణ నాయక్తో పాటు మున్సిపల్ సిబ్బంది కలిసి మానవతా దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో పోలీసుల ఈ సేవ స్థానికంగా ప్రశంసలపాలైంది.