KDM: తోగ్గుడెం పంచాయతీ కేంద్రంలో మణుగూరు – వరంగల్ ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు, ఇసుక లారీల మితిమీరిన రాకపోకల వల్ల రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాలన్నీ మరోవైపు నుంచే వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.