MNCL: కాగజ్ నగర్ డివిజన్ రాస్పల్లి,చెడ్వాయి అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలు ఉన్నాయని అటవీ అధికారులు ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 తర్వాత సాయంత్రం 4 గంటలలోపు పనులు ముగించుకొని ఇళ్లలో ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా అడవికి వెళ్లరాదని, పశువుల కాపరులు అడవికి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి కనిపించినట్లయితే సమాచారం అందించాలన్నారు.