RR: అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ముగ్గురు వ్యక్తులు కళాశాలలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు పక్కా రెక్కీ నిర్వహించిన అనంతరం చోరీ చేసినట్లు తెలుస్తోంది. చోరీ చేసిన అనంతరం కళాశాల వెనుక ఉన్న గుట్ట ప్రాంతం నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.