KDP: ఖాజీపేట(M) పుల్లూరు సమీపంలో నాగనాధేశ్వర ఆలయ కోన ప్రాంగణంలో ఉన్న కాశీనాయన ఆలయానికి నూతన ఆర్చి నిర్మాణం చేపట్టారు. ఆలయ కమిటీ,భక్తుల సహకారంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. కార్తీకమాసం ఉత్సవాల సందర్భంగా ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు రావాలని కమిటీ సభ్యులు కోరారు.