ELR: ముదినేపల్లిలోని పోలరాజ్ కాలువలో గల్లంతయిన విమల (65) ఆచూకీ కోసం 3వ రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగాయి. అమలాపురం నుంచి వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ బృందం పర్యటించే బోటు శనివారం మరమ్మతులకు గురవడంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. కాకినాడ నుంచి మరో బోటు తీసుకువచ్చి ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు పర్యవేక్షించారు.