MBNR: జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, ‘జడ్చర్ల గాంధీ’గా పేరొందిన కొత్త కేశవులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు.