JN: జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశాన్ని బుధవారం నిర్వహించినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు సౌడ రమేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మరియు హామీలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాకి వినతిపత్రాన్ని అందించినట్లు తెలిపారు.