యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు కలెక్టర్ హనుమంతరావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా దసరాను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అందరి జీవితాల్లో విజయాలు సమకూరాలని, తలపెట్టిన కార్యక్రమాలన్నీ సఫలం అవ్వాలని కోరారు. దుర్గామాత అనుగ్రహంతో అందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.