AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. దర్శనం కోసం భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 79,496 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.