మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో జాషువా 130వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎంఆర్పీఎస్ నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి టీఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు బోయపల్లి నర్సింహులు, రాష్ట్ర అధ్యక్షులు సిరసనల్ల బాలరాజు మాదిగ, స్థానిక నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.