అన్నమయ్య: మదనపల్లెలోని శ్రీ వరాల ఆంజనేయస్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వాములకు పూజలు నిర్వహించారు.