TG: గాంధీభవన్ ఎదుట మున్నూరుకాపు నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, పార్టీలో తగిన ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో మున్నురుకాపు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.