AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్ వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్య లక్ష్మి మాట్లాడుతూ.. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి విభాగాల్లో యూనిట్ల గురించి వాటి ద్వారా అందించే సేవలు గురించి విపులంగా వివరించారు. విద్యార్థులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.