MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి రేంజ్లో ముందస్తు సమాచారం మేరకు అటవీ అధికారులు సోదాలు నిర్వహించి వన్యప్రాణిని చంపి వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేతనపల్లి శివారులో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణిని వేటాడినట్లు నిందితులు అంగీకరించారు. నెందుగూరి నారాయణ, గురుండ్ల వసంత్, నిక్కూరి బాపుపై కేసు నమోదు చేసినట్లు FRO హఫీజుద్దీన్ తెలిపారు.