KMM: జులై 9 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఆటో బంద్ చేయాలని INTUC పార్లమెంట్ అధ్యక్షులు పాల్వంచ కృష్ణ పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో ఆటో, ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.