BDK: మణుగూరు మండలంలోని వంద పడకల హాస్పిటల్ నందు కింగ్ డోమ్స్ కల్చర్ మినిస్ట్రీస్ ఆద్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫౌండేషన్ సభ్యులు అంజుమనార బేగం బీటీపీఎస్ నందు ఉద్యోగం చేసుకుంటూ సామాజిక సేవ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు.