HYD: మహానగరంలో ట్రాఫిక్ కంట్రోల్ కష్టతరంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. వంతెనలు, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టినప్పటికీ, బేగంపేట లాంటి పలు ప్రాంతాల్లో వంతెనలు పై సైతం వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. గ్రేటర్ నగరంలో రోడ్ల విస్తరణకు అంతగా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పబ్లిక్ రవాణా వైపు వెళ్తే మంచిదని అధికారులు సూచించారు.