GDWL: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.