AP: మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాల రూపకల్పనకు ప్రయత్నిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. పాఠ్యాంశాలతో సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. వైసీపీ నేతలను నిత్యం మహిళలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లిని గెంటేసిన జగన్ను ఆదర్శంగా తీసుకున్నారేమోనని దుయ్యబట్టారు. వైసీపీ నేతల అహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.