WNP: వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలసాగుకై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఖరీఫ్ సాగుపై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఒక్కో వ్యవసాయ విస్తీర్ణ అధికారి కనీసం ముగ్గురు రైతులను ఒప్పించి పంట మార్పిడి చేయించాలని సూచించారు.