KRNL: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి శుక్రవారం రూ.2.5 లక్షలు విరాళంగా వచ్చిందని మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. కోయంబత్తూరుకు చెందిన గౌతమ్ అనే భక్తుడు శ్రావణ మాసంలో జరగనున్న స్వామి ఆరాధన ఉత్సవాల్లో నిర్వహించే అన్నదానం కోసం ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. దాతకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు.