KRNL: కోసిగి ఎమ్మార్వో వేణుగోపాల్ శుక్రవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను బహుకరించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని భూ సమస్యలు సహా ఇతర ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. బాధ్యతతో ప్రజల సంక్షేమాన్ని కాపాడాలని కోరారు.