ADB: మావల మండల కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెంచుఘాట్ గ్రామానికి చెందిన రైతులు లక్క శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కొమర రాజు పటేల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు ఉన్నారు.