NGKL: కోడేరు మండలం పసుపుల అంగన్వాడి కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రావణ్ కుమార్ తనిఖీ చేశారు. గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు వండిన ఆహారాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించి వారి ఎదుగుదలకు దోహదపడాలని అంగన్వాడి టీచర్కు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కురుమూర్తి, అంగన్వాడి టీచర్, పాల్గొన్నారు.