రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బ్యాగు గుర్తును కేటాయించింది. 2025లో జరగనున్న బిహార్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ గుర్తును ఇచ్చింది. ఈ కొత్త గుర్తుతో పార్టీలోని మొత్తం 243 మంది అభ్యర్థులు ఇప్పుడు ఈ కొత్త సింబల్పై పోటీ చేయవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్ణయం పట్ల పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.