SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ దచారం కనకయ్య బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.