ATP: గుంతకల్లు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు బుధవారం టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ మాట్లాడుతూ.. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో కార్మికులకు జీతాలు పెంచిందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జయరాం విజయవాడలో ఉన్నారని, మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్తారని వారికి హామీ ఇచ్చారు.