AP: మద్యం కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత జూలై 2న ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కూడా విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేసింది. ఈ క్రమంలో విచారణను రేపటికి వాయిదా వేసింది.