ADB: తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలకు వెళుతున్న ఆటో ఉండం గ్రామం వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఆశ్రమ పాఠశాల టీచర్లు తీవ్రంగా గాయపడి పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న MLA పాయల్ శంకర్ క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను కోరారు.